రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఫైర్‌పై భర్తతో గొడవ: ఇద్దరు కూతుళ్లను చంపిన తల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman held for killing daughters
హైదరాబాద్‌: భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని గొడవ పడిన భార్య తన ఇద్దరు పిల్లలను బావిలో పడేసి హత్య చేసింది. రంగారెడ్డి జిల్లాలోని వెల్చాల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భర్తపై కోపంతో రాత్రిపూట బయటకు తన పిల్లలను తీసుకుని వెళ్లి బావిలో పడేసింది. పిల్లలు సుచరిత, స్రవంతి అక్కడికక్కడే మరణించారు.

పిల్లలను చంపిన తల్లి కె. సుజాత (28)ను పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. ఆమె భర్త రవి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సుజాత ఇంట్లోనే ఉంటుంది. తన ఇద్దరు పిల్లలను తన భర్త రవి చంపాడని సుజాత మొదట పోలీసులకు చెప్పింది. అయితే, తానే సుచరిత, స్రవంతిలను గ్రామ శివారులోని బావిలో పడేశానని ఆ తర్వాత అంగీకరించింది.

తన భర్త రవి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని ఆగ్రహించిన మహిళ ఆ దురాగతానికి పాల్పడింది. భర్తతో ఆమె రాత్రిపూట గొడవ పడింది. ఆ కోపంలో పిల్లలతో బయటకు వెళ్లిపోయి వారిని బావిలో పడేసింది.

స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. భర్తపై కోపంతో తీవ్ర చర్యకు దిగిన మహిళ ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సి వస్తోంది.

English summary

 28-year-old woman was arrested on Wednesday for allegedly killing her two daughters by throwing them into a well at Velchala in RR district.tnn Sucharita and Shravanti, the girls, were declared dead on the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X