బిజెపిలో నేనూ ప్రధాని అభ్యర్థినే: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu
పానాజీ: తమ పార్టీలో ప్రధాని అభ్యర్థులకు కొదవ లేదని, అద్వానీ, సుష్మా స్వరాజ్, తనకు అందరికీ అర్హతలున్నాయని, ప్రధాని అభ్యర్థిపై పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీకి ప్రజలు అధికారం ఇచ్చారని, మోడీగా జాతీయస్థాయి నేత అని, అయితే, ప్రధాని అభ్యర్థిపై పార్టీ ఇంకా చర్చ లు జరపాల్సి ఉండడమే అసలు సమస్య అని వివరించారు.

పానాజీలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. యుపిఎ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పదని, యువ నేతలను తెరపైకి తీసుకొచ్చినా ఆ పార్టీని ఎవ్వరూ కాపాడలేరని అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండంకెల సంఖ్యకు పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ తమను మోసగించిందని ప్రజలు భావిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నో కుంభకోణాలతో సతమతమవుతోందని, ముందస్తుకు వెళ్లినా వెళ్లవచ్చని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ ముందుగా తమ దేశంలోని సంక్షోభం గురించి చూసుకోవాలని, షారుక్ గురించి రెహ్మాన్ మాలిక్‌కు ఎందుకని ఎద్దేవా చేశారు.

పార్టీ నేతలు ప్రసంగాలు చేసే సమయంలో సంయమనం పాటించాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఉద్బోధించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. శాంతి, సహనం అవసరమని హితవు పలికారు.

ఇదిలావుంటే, నితిన్ గడ్కరీ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టకుండా పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు చేతులు కలిపి మరీ కుట్ర చేశారని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య ఆరోపించారు. గడ్కరీకి వ్యతిరేకంగా మీడియాకు సమాచారం కూడా వారే అందించారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+