యాత్ర, మీడియాల ద్వారా దుష్ప్రచారం చేసినా..: బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: పాదయాత్రల ద్వారా, మీడియా ద్వారా తమపై దుష్ప్రచారం చేసి, అపోహలు కలిగించడానికి ప్రయత్నించినా మొదటి దశ సహకార సంఘాల ఎన్నికల్లో తామే విజయం సాధించామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తాము ఒంటరి పోరాటం చేసి 60 శాతానికి పైగా సొసైటీలు గెలుచుకున్నామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కొన్ని చోట్ల వైయస్సార్ కాంగ్రెసు - తెలుగుదేశం, మరిన్ని చోట్ల వైయస్సార్ కాంగ్రెసు - తెలంగాణ రాష్ట్ర సమితి , మరికొన్ని చోట్ల వైయస్సార్ కాంగ్రెసు - తెరాస కలిసి పనిచేసినా తమ కాంగ్రెసు పార్టీ గెలిచిందని ఆయన అన్నారు.

తమకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల విధేయత ప్రదర్సించి వచ్చే పార్టీలతో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెసు తెలుగుదేశం పార్టీతో కలిసిపోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుతో కలిసిపోయిందని వైయస్సార్ కాంగ్రెసు అన్నా, కాంగ్రెసు ఆటలు ఆడుతోందని తెరాస నాయకులు వారి భాషలో అన్నా ప్రజలు తమ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ప్రజలకు మేలు చేస్తే వారు తమ పట్ల ఉంటారనే విషయం సహకార ఎన్నికల ఫలితాల ద్వారా వ్యక్తమైందని ఆయన అన్నారు. రెండో దశ సహకార సంఘాల ఎన్నికల్లోనూ తాము గెలుస్తామని ఆయన చెప్పారు.

అయితే, ఇబ్బందులు ఉన్నాయని, విద్యుత్తు సమస్య ఉందని, దాన్ని అధిగమించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. పాదయాత్రల ద్వారా, మీడియా ద్వారా తమపై దుష్ప్రచారం సాగించి ప్రజల్లో అపోహలు కలిగించడానికి ప్రయత్నించారని ఆయన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలను ఉద్దేశించి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+