మమతా బెదిరించారు, అందుకే రాలేదు: సల్మాన్ రష్దీ
ట్విటర్లో ఆయన తన వాదనను వినపించారు. గతనెల 30వ తేదీన కోల్కతా సాహిత్య సమ్మేళనంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఆయన నవలకు సినిమా రూపం'మిడ్నై ట్ చిల్డ్రన్' ప్రచార కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. కోల్కతా వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నానని, మరుసటి రోజు బయలుదేరతాననగా కోల్కతా పోలీసులు తనను సంప్రదించారని, ఎట్టిపరిస్థితుల్లో నగరంలోకి అడుగుపెట్టవద్దన్నారని ఆయన చెప్పారు.
పర్యటన గురించి కావాలనే మీడియాకు, ముస్లిం సంస్థలకు మీరు ఉప్పందించారని ఆయన ఆరోపించారు. ఎందుకు రాకూడదని తాను అడిగితే, కోల్కతాలో మత ఘర్షణలు రేపే ఉద్దేశం దీని వెనక కనిపిస్తోందని, దీనివల్ల కోల్కతాకు మీరు రాకూడదనేది మమత ఆదేశమని, కాదని వచ్చారా.. తరువాతి విమానంలోనే మిమ్మల్ని మూటకట్టి వెనక్కి పంపించేస్తామని తన విజ్ఞప్తిగా మీకు మా ముఖ్యమంత్రి చెప్పమన్నారని వారు స్పష్టం చేసినట్లు రష్దీ వివరించారు.
అయితే, రష్దీని తామేమీ పిలవలేదని సాహిత్య సమ్మేళనం నిర్వాహకులు వేరే ప్రకటనలో స్పష్టం చేశారు. దానిపై రష్దీ స్పందిస్తూ.. అది అమర్యాదకరమని, వాళ్లే తన విమానం టెకెట్లు బుక్ చేశారన్నారు. మమత ఒత్తిడి వల్లే వాళ్లలా మాట్లాడి ఉండొచ్చని ఆరోపించారు.