పరిటాలశ్రీరాంపై ఇలా, జెసి ఫ్యామిలీ మాటేమిటి?: టిడిపి

జెసి కుమారుడు, ఆయన తమ్ముడి కుమారుడు దాడి చేసి నాలుగేళ్లయినా నేటికీ వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 2009 ఏప్రిల్ 24న ఆయన ఇంటిపై దాడి జరిగిందని... ఆ కేసులో జెసి ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డిపై నాన్బెయిల్బుల్ వారెంట్లు జారీ అయినా నేటి వరకు పోలీసులు ఎందుకు వారిని అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు.
జెసి కుమారులు విదేశాల్లో ఉన్నట్లు కోర్టుకు సమాచారం ఇస్తున్నారని.. వాస్తవానికి వారు యథేచ్చగా బయట తిరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. దీని వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయని పెద్దిరెడ్డి పోలీసుల్ని నిలదీశారు. ఇప్పటికే జెసి కుటుంబం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, రెండో చార్జ్షీట్లో తమ పేర్లు లేకుండా చేసి, నాన్బెయిల్బుల్ వారెంట్లు ఎత్తేసేలా ప్రయత్నాలు చేసిందని.. దీనిని కోర్టు కూడా తప్పు పట్టిందని ఆయన గుర్తు చేశారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్పై ఫిర్యాదు అందిన వెంటనే తప్పుడు సెక్షన్లతో కేసులు నమోదు చేసి, అతణ్ని అరెస్టు చేయడానికంటూ అర్ధరాత్రి సోదాలు నిర్వహించారని, అదే ఉత్సాహం జెసి కుటుంబంపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం ఎందుకు చూపడం లేదని ఆయన నిలదీశారు. శ్రీరామ్ పైన తప్పుడు కేసులు బనాయించారన్నారు.












Click it and Unblock the Notifications