జైల్లో జగన్తో చింతలపూడి ఎమ్మెల్యేభేటీ: ముహూర్తం..
జగన్ సూచనల మేరకు రాజేష్ ఈ రోజే గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో జగన్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవలే జగన్ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మద్దాల రాజేష్ పేరు కూడా ఒకటి. జగన్ పార్టీలో చేరుతానని ఆయన ఇప్పటికే ప్రకటన చేశారు.
కాగా జగన్ పార్టీలోకి వెళ్తానని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేష్ గతంలోనే తన శాససనభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజేష్ మూడు నెలల క్రితం స్పీకర్ నాదెండ్ల మనోహర్ కార్యాలయానికి చేరుకొని తన రాజీనామాను సమర్పించారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అతను తన లేఖను కార్యాలయంలో అందజేశారు. రాజేష్ గతంలో పలుమార్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, జగన్ను కలిశారు.
జగన్ పార్టీలో చేరేందుకు సిద్దపడ్డ రాజేష్.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను కార్యకర్తగా పని చేస్తానని, వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తాను శాసనసభ్యుడిగా విజయం సాధించానని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పుకున్నారు.