హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో జగన్‌తో చింతలపూడి ఎమ్మెల్యేభేటీ: ముహూర్తం..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Maddala Rajesh
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ మంగళవారం ఉదయం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ములాకత్ సమయంలో మద్దాల రాజేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతను కలిశారు. ఆయనతో పార్టీలో చేరే విషయమై చర్చించినట్లుగా తెలుస్తోంది.

జగన్ సూచనల మేరకు రాజేష్ ఈ రోజే గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో జగన్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవలే జగన్ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మద్దాల రాజేష్ పేరు కూడా ఒకటి. జగన్ పార్టీలో చేరుతానని ఆయన ఇప్పటికే ప్రకటన చేశారు.

కాగా జగన్ పార్టీలోకి వెళ్తానని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేష్ గతంలోనే తన శాససనభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజేష్ మూడు నెలల క్రితం స్పీకర్ నాదెండ్ల మనోహర్ కార్యాలయానికి చేరుకొని తన రాజీనామాను సమర్పించారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అతను తన లేఖను కార్యాలయంలో అందజేశారు. రాజేష్ గతంలో పలుమార్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, జగన్‌ను కలిశారు.

జగన్ పార్టీలో చేరేందుకు సిద్దపడ్డ రాజేష్.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను కార్యకర్తగా పని చేస్తానని, వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తాను శాసనసభ్యుడిగా విజయం సాధించానని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పుకున్నారు.

English summary
Chintalapudi MLA Maddala Rajesh met YSR Congress Party chief YS Jaganmohan Reddy on Tuesday in Chanchalguda Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X