Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్టీఐ కమిషనర్లుగా ఆ నలుగురే: నెగ్గిన కిరణ్ పంతం

Kiran Kumar Reddy-Narasimhan
హైదరాబాద్: సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకానికి గవర్నర్ నరసింహన్ బుధవారం ఆమోదముద్ర వేశారు. గతంలో తిప్పి పంపిన ఫైలుకే గవర్నర్ ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. గతంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లు నియమించబడ్డారు. కొత్తగా మరో నలుగురికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో కమిషనర్లు ఇప్పుడు ఎనిమిది మంది అయ్యారు. ఈ రోజు గవర్నర్ ఆమోదం తెలిపిన వారిలో ఇంతియాజ్ అహ్మద్, తాంతియా కుమారి, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు ఉన్నారు.

గతంలో ఈ నలుగురి పేర్లను గవర్నర్ తిప్పి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అదే దస్త్రాన్ని పంపించారు. దీంతో గవర్నర్ ఆ ఫైలుకు ఆమోదం తెలిపారు. పది నెలల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి, నరసింహన్‌ల మధ్య ఈ అంశం కోల్డ్ వార్‌ను తలపించింది. అప్పుడు ప్రభుత్వం తాంతియా కుమారి, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, విజయ్ బాబు, ప్రభాకర్, మధుకర్ రాజు, రతన్ పేర్లతో కూడిన ఫైలును పంపించింది.

అయితే గవర్నర్ కేవలం విజయ్ బాబు, ప్రభాకర్, మధుకర్ రాజు, రతన్ పేర్లను మాత్రమే ఆమోదించారు. మిగిలిన నలుగురి పేర్లను తిరస్కరించారు. ఇది అప్పట్లో చర్చకు దారి తీసింది. తాను తిరస్కరించిన వారిపై న్యాయసలహాలు తీసుకోవాలని గవర్నర్ అప్పట్లో ప్రభుత్వానికి సూచించారు. అయితే కిరణ్ ప్రభుత్వం దాదాపు సంవత్సరం తర్వాత తిరిగి వారి పేర్లనే గవర్నర్‌కు పంపించింది.

పంతం నెగ్గించుకున్న కిరణ్

ఆర్టీఐ కమిషనర్లుగా తాను మొదట సూచించిన ఇంతియాజ్ అహ్మద్, తాంతియా కుమారి, విజయ నిర్మల, వెంకటేశ్వర్లుల పేర్లను గవర్నర్‌చే ఆమోదింప చేసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారని చెప్పవచ్చు. ఏడాది క్రితం తిరస్కరించిన గవర్నర్ ఇప్పుడు వాటికి ఓకె చెప్పాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏదైనా ఫైలును రెండోసారి పంపిస్తే గవర్నర్ సంతకం చేయాల్సి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+