భయం గుప్పిట్లో 40 నిమిషాలు: అప్పుడేమైంది?

పార్లమెంటు శీతాకాలం సమావేశాలు జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ రోజు పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడి చాలా సేపు కాలేదు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వెళ్లిపోయారు. అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్కె అద్వానీతో పాటు పలువురు ముఖ్య నేతలు పార్లమెంటు ఆవరణలోనే ఉన్నారు.
ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో భద్రతా సిబ్బంది ఏమరుపాటు ప్రదర్శించలేదు. దాదాపు 40 నిమిషాల పాటు పార్లమెంటు ఆవరణ కాల్పుల మోతలతో దద్దరిల్లింది. పార్లమెంటు ఆవరణ భయం గుప్పిట్లో చిక్కుకుపోయింది. ఉగ్రవాదుల కాల్పుల్లో 9 మంది మరణించగా, 18 మంది గాయపడ్డారు.
భద్రతా సిబ్బంది ఐదుగురు ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టారు. ఉగ్రవాదుల చేతిలో మరణించినవారిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన జర్నలిస్టు ఒకరు ఆ తర్వాత మరణించారు. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురును 2001 డిసెంబర్ 15వ తేదీన అరెస్టు చేశారు.
ఉగ్రవాదులకు తాను ఆయుధాలు సమకూర్చినట్లు, ఇతర సహాయం అందించినట్లు అఫ్జల్ గురు అంగీకరించాడు. ఈ దాడి వెనక జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా కుట్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications