అప్పుడు చేశాం, అవసరమైతే ఇప్పుడూ చేస్తాం: సచిన్

రైతుల కోసం కేంద్రం అవసరమైతే మరోసారి రుణ మాఫీకి సిద్ధంగా ఉందని చెప్పారు. సచిన్ వ్యాఖ్యల ద్వారా ముందస్తు ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2009 ఎన్నికలకు ముందు తీసుకున్న కీలక నిర్ణయాన్ని 2014 ఎన్నికల ముందు కూడా పునరావృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి రాజేష్ పైలట్ 68వ జయంతి సందర్భంగా గుర్గావ్లో ఆదివారం కిసాన్ సమ్మేళన్ నిర్వహించారు. ఈ సభలో కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సచిన్ పైలట్ మాట్లాడారు.
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని, గత ఎనిమిదేళ్లుగా యూపిఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ, రైతు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. తామెప్పుడూ రైతుల పక్షానే నిలిచామని, వారెంత కీలకమో తమకు తెలుసునని అందుకే, గత యూపిఏ ప్రభుత్వం రూ.70 వేల కోట్ల రుణ మాఫీ పథకాన్ని అమలు చేసిందన్నారు. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు మేలు జరిగిందన్నారు.
ఇటువంటి మరో పథకాన్ని ప్రకటించేందుకు తమ ప్రభుత్వం వెనకాడడం లేదన్నారు. అవసరమైతే, మరో రుణ మాఫీ పథకాన్ని ప్రకటించేందుకూ అభ్యంతరం లేదన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు అంటే, 2008 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం రుణ మాఫీ పథకాన్ని ప్రకటించింది. అప్పుడూ, ఇప్పుడూ ఆర్థిక మంత్రి చిదంబరమే. అప్పట్లో ఆయనే ఈ పథకాన్ని ప్రకటించారు. చిన్న, మధ్య తరగతి రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నామన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications