రాజకీయాలకు నిర్మాత బండ్ల గణేష్ పావు అయ్యారా?

స్వయంగా బండ్ల గణేష్ కూడా సామాజిక వెబ్ సైట్లో ఇదే విధంగా స్పందించారు. తాను కష్టపడి పైకొచ్చానని, తన వద్ద ఉన్న ప్రతి రూపాయి తన చెమటతో సంపాదించిందేనని, తాను ఎవరికీ బినామీని కాదని, తాను రాజకీయాల్లో లేనని, రాజకీయ లబ్ధి కోసం తనను బలి చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తనపై అనవసర బురద జల్లడం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయాల కోసం తనను బలి చేస్తున్నారనే అభిప్రాయపడ్డారు.
బండ్ల గణేష్తో పాటు పలువురు ఆయన రాజకీయాలకు పావుగా మారారని అంటున్నారు. గణేష్కు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓ ఫంక్షన్లో అధికార పార్టీకి చెందిన ఆ నేత గురించి గణేష్ చేసిన వ్యాఖ్యలు టిడిపికి విమర్శనాస్త్రాలుగా ఉపయోగపడ్డాయి. గణేష్ ఇళ్లు, కార్యాలయాలపై దాడిపై టిడిపి స్పందిస్తూ.. గణేష్ వెనుక ఉన్న వారి ఇంట్లోనూ సోదాలు చేయాలని డిమాండ్ చేశారు.
అధికార పార్టీలో రాజకీయ ఆధిపత్యం నెలకొని ఉంది. దీంతో ఒకరిని దెబ్బతీసేందుకు మరొకరు తన మెదడుకు పదను పెడుతున్నారు. ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇలా ఒకరిపై మరొకరు దెబ్బతీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బండ్ల గణేష్ చెప్పినట్లుగా ఇప్పుడు వారి రాజకీయ క్రీడలో ఇతను పావుగా మారి ఉండవచ్చుననే చర్చ సాగుతోంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications