రెండో పెళ్లికి యత్నం: పెళ్లి మండపంలో భార్య నిలదీత
పెళ్లి కొడుకులా తయారయి తాళి కట్టేందుకు రమేష్ సిద్ధమయ్యాడు. అయితే, తన భర్తకు రెండో పెళ్లి విషయం తెలుసుకున్న మొదటి భార్య కలమ్మ బంధువులతో కలిసి వెళ్లి పెళ్లి వేడుక వద్దకు వెళ్లింది. భర్తను నిలదీసింది. వచ్చిన వారికి అసలు విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు రమేష్కు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆయనను పోలీసులకు అప్పగించారు.
చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
ఆత్మకూరు మండలం లాడెళ్లలో చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. గురువారం ఉదయం చెరువులో స్నానానికి వెళ్లిన విద్యార్థులు తిరిగి రాక పోవడంతో కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు.
కర్నూలులో అగ్ని ప్రమాదం
జిల్లాలోని కోడుమూరు రోడ్డులో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ హోటల్, రెండు కోళ్ల ఫారంలు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. దాదాపు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా.