హాలీవుడ్ను తలపించేలా నిమిషాల్లో 300 కోట్లు చోరీ

సెక్యూరిటీ సిబ్బంది విమానాశ్రయంలో వజ్రాల పెట్టెలు పెడుతుండగా రన్వే పైకి రెండు వాహనాలు దూసుకొస్తూ కనిపించాయి. అందులో ఒకటి మెర్సిడెస్ వ్యాను, రెండోది పోలీసు వాహనాన్ని తలపించేలా నీలిరంగు బల్బులు వెలుగుతున్న ఆడి సెలూన్ కారు. వాళ్లంతా ఆ షాక్లోంచి బయటపడేలోగానే ఆ రెండు వాహనాలూ అక్కడికొచ్చి ఆగాయి. ముసుగులు ధరించిన ఎనిమిది మంది సాయుధ దుండగులు వాటిలోంచి దిగారు.
వారి చేతుల్లో అధునాతన మారణాయుధాలున్నాయి. చీకట్లో సైతం గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించగల లేజర్ సౌకర్యం ఉన్న ఆటోమేటిక్ ఆయుధాలు వారి వద్ద ఉన్నాయి. ఆ తుపాకులను వారు విమానాశ్రయ సిబ్బందికి గురి పెట్టారు. కదిలితే కాల్చిపారేస్తామని హెచ్చరించారు. విమానంలోకి లోడ్ చేస్తున్న రెండు వజ్రాల పెట్టెలను తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. కన్నుమూసి తెరిచేలోగా వచ్చిన దారిలో అక్కణ్నుంచి పరారయ్యారు.
వారు దోచుకున్న వజ్రాల విలువ దాదాపుగా 300 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఆ వజ్రాలు ఆంట్వెర్ప్ నుంచి జ్యూరిచ్కు ఎగుమతి చేస్తున్న విషయాన్ని ముందుగా పసిగట్టిన నేరగాళ్లు పకడ్బందీ వ్యూహంతో పక్కా ప్రణాళికతో నిమిషాల వ్యవధిలో కొల్లగొట్టారు. వారు ఈ దోపిడీని మూడు నిమిషాల్లోనే చేశారు. గన్నులతో భయపెట్టి వారు తమ పనిని ముగించుకు వెళ్లారు. నేరస్తులను పట్టుకునేందుకు బెల్జియం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
విమానాశ్రయానికి సమీపంలో కాలిపోయిన స్థితిలో ఉన్న మెర్సిడెస్ వ్యాన్ పోలీసులకు కనిపించింది. ఇది భారీ దోపిడీ అని ఆంట్వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్కు చెందిన కారోలిన్ డి వోల్ఫ్ అన్నారు. ఈ దోపిడీకి పాల్పడినవారు రన్వేకి ఉన్న కంచెకు రంధ్రం చేశారని దాంట్లోంచే రన్వేపైకి ప్రవేశించి, తిరిగి అదే మార్గం గుండా బయటికి తప్పించుకున్నారని విమానాశ్రయానికి చెందిన ప్రతినిధి జాన్ వాన్ డెర్ క్రూసే తెలిపారు. తాము అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ ఎలా జరిగిందో అర్థం కావట్లేదని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం ఆంట్వెర్స్ డైమండ్ సెంటర్ వద్ద ఇంచుమించు రూ.536 కోట్ల విలువైన వజ్రాలను దోచకెళ్లారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications