అందుకే మక్బుల్కి వైఎస్ క్షమాభిక్ష: గాలి, గవర్నర్ సైన్

మరోవైపు సయీద్ మక్బూల్ క్షమాభిక్ష రద్దు పైలుకు గవర్నర్ నరసింహన్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. ఇండియన్ ముజాహిదన్ ఉగ్రవాది మక్బూల్కు క్షమాభిక్షను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఫైలును ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ సిఎం పంపిన ఫైలుపై సంతకం చేసి ఆమోద ముద్ర వేశారు.
కాగా, దిల్షుక్నగర్ పేలుళ్ల నేపథ్యంలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్కు ప్రసాదించిన క్షమాభిక్షను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మక్బూల్కు 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసిందే. గతంలో నిజామాబాద్లో కృష్ణమూర్తిని హత్య చేసిన మక్బూల్ అరెస్టు అయ్యాడు.
సత్ప్పవర్తన కలిగిన ఖైదీల విడుదలలో భాగంగా మక్బూల్ జైలు నుంచి విడుదలయ్యాడు. మక్బూల్కు వైఎస్ క్షమాభిక్ష ప్రకటించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి దీనికి సంబంధించిన జీఓ 338, హోం డేటెడ్ 24-7-2009న రెమిషన్ కోసం మార్గదర్శకాలు రూపొందించేందుకు వైయస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ తర్వాత సెప్టెంబర్ 2న వైయస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన రోశయ్య ఆ జీఓను యధాతథంగా అమలుచేశారు. ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్లో ఉన్న మక్బూల్ను దిల్సుఖ్నగర్ బాంబు పేలుడు కేసు నేపథ్యంలో నగరానికి తీసుకువచ్చి, సోమవారమే ఢిల్లీకి తరలించారు. వైయస్ క్షమాభిక్షతో జైలు నుంచి బయటకు వచ్చిన మక్బూల్ 2012లో ఉగ్రవాద కార్యక్రమాల్లో పాల్గొనడంతో అరెస్టయ్యాడు. హైదరాబాద్ నగరంలో 10 చోట్ల పేలుళ్లకు రిక్కీ నిర్వహించాడు.
మక్బూల్కు క్షమాభిక్ష పెట్టిన విషయాన్ని బాంబు పేలుళ్ల తర్వాత జరిగిన సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి ఆలస్యంగా తీసుకువెళ్లారు. హోంమంత్రి సబిత కూడా దానిపై సమీక్ష నిర్వహించారు. ఈ ఫైలుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications