చైనా జైళ్లలో మన సైనికులు? 1962 నాటి యుద్ధం దాచిన భయంకర నిజాలు!

1962 నాటి భారత్-చైనా యుద్ధం.. భారత సైనిక చరిత్రలో ఎప్పటికీ మానిపోని ఒక పెద్ద గాయం. హిమాలయ పర్వతాల సాక్షిగా జరిగిన ఆ పోరాటంలో మన జవాన్లు శత్రువుతోనే కాదు.. నరకం లాంటి చలితో, వసతుల లేమితో, గందరగోళంతో పోరాడారు. కేవలం నెల రోజులు మాత్రమే జరిగిన ఆ యుద్ధం వదిలివెళ్లిన కన్నీటి గాథలు, అనిశ్చితి మాత్రం దశాబ్దాల పాటు వేలాది భారతీయ కుటుంబాలను వెంటాడాయి. ఆ చీకటి రోజుల్లో అసలేం జరిగింది? మన జవాన్లు అనుభవించిన నరకయాతన ఏంటి?

నాడు లడఖ్, నాటి నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్) సరిహద్దుల్లోని భారత స్థావరాలపై చైనా దళాలు ఒక్కసారిగా ఆకస్మిక దాడికి తెగబడ్డాయి. అప్పటికే తీవ్రమైన మంచు కురుస్తున్న ఆ పర్వత ప్రాంతాల్లో మన సైనికులు సరైన శీతాకాలపు దుస్తులు, కనీస రవాణా సౌకర్యాలు, ఫిరంగి మద్దతు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శత్రువు వ్యూహాత్మకంగా భారీ ఎత్తున విరుచుకుపడటంతో.. ఆ భయంకరమైన వాతావరణంలో సమాచార వ్యవస్థలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయి. దీంతో ఎటు వెళ్లాలో తెలియక, ఆర్డర్స్ సరిగ్గా అందక మన సైనిక విభాగాలు చెల్లాచెదురైపోయాయి. మనుగడ సాగించడమే అసాధ్యమైన ఆ మంచు కొండల్లో వేలాది మంది సైనికులు దారి తప్పి అదృశ్యమయ్యారు.

The Cold Shadows Of 1962 War How Himalayas Became A Deadly Enemy For Missing Indian Soldiers In Conflict

'కనిపించకుండా పోయిన' జవాన్లు.. ఆశ, నిరాశల మధ్య కుటుంబాలు!

యుద్ధం ముగిసిన తర్వాత దేశం ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది.. 'తిరిగి రాని మన సైనికులు ఏమయ్యారు?'. దాదాపు 1,300 మందికి పైగా జవాన్లు వీరమరణం పొందినట్లు తేలింది. మరికొందరు చైనా సైన్యానికి యుద్ధ ఖైదీలుగా దొరికిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 3,900 మంది భారత జవాన్లను చైనా ఆర్మీ బంధించి, టిబెట్‌లోని కఠినమైన జైలు శిబిరాలకు తరలించింది. నవంబర్ 1962లో చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, దశలవారీగా ఖైదీలను విడుదల చేసేంత వరకు.. తమ వారు బతికే ఉన్నారో లేదో తెలియక భారతదేశంలోని వారి కుటుంబాలు క్షణమొక యుగంగా నరకం అనుభవించాయి.

9 వేళ ఏళ్ల నాటి 'ప్రేతాత్మల’ రహదారి! కాలం దాచిన అడుగుజాడలు..
9 వేళ ఏళ్ల నాటి 'ప్రేతాత్మల’ రహదారి! కాలం దాచిన అడుగుజాడలు..

శత్రువు కంటే ప్రమాదకరంగా మారిన హిమాలయాలు!

యుద్ధం ముగిసినా కథ ముగియలేదు. తమ యూనిట్లతో సంబంధాలు తెగిపోయిన వందలాది మంది సైనికులు ఆ గడ్డకట్టే చలిలో, ఆకలితో, గాయాలతో వారాల తరబడి హిమాలయ పర్వతాల్లో తిరుగుతూనే ఉన్నారు. కొందరు ఎలాగోలా ప్రాణాలతో భారత స్థావరాలకు చేరుకోగా.. మరికొందరు రెస్క్యూ టీమ్స్ వచ్చేలోపే అతిశీతల వాతావరణానికి, ఆక్సిజన్ అందక కొండల్లోనే ప్రాణాలు విడిచారు. యుద్ధం ఆగిపోయిన నెలల తర్వాత కూడా మారుమూల లోయల నుండి, బంకర్ల నుండి మన జవాన్ల మృతదేహాలు లభ్యమవడమే దీనికి నిదర్శనం. మొదట 'కనిపించకుండా పోయినవారు' (Missing) గా నమోదైన చాలా మంది.. ఆ తర్వాత శవాలై కనిపించారు.

కొరియాను పాలించిన అయోధ్య యువరాణి! వేల ఏళ్ల నాటి పురాణ రహస్యం
కొరియాను పాలించిన అయోధ్య యువరాణి! వేల ఏళ్ల నాటి పురాణ రహస్యం

పుకార్లు.. వాస్తవాలు.. నేర్పిన గుణపాఠం!

యుద్ధం ముగిసిన తర్వాతి దశాబ్దాల్లో.. చైనా కొందరు భారతీయ యుద్ధ ఖైదీలను విడిచిపెట్టకుండా రహస్య జైళ్లలో ఉంచిందనే ఎన్నో పుకార్లు, కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చరిత్రకారులు, సైనిక రికార్డుల ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదని తేలింది. అసంపూర్ణ రికార్డులు, చేరుకోలేని లోయల్లో మరణించడం వల్లే వారు మిస్సింగ్ లిస్ట్‌లో ఉండిపోయారు తప్ప, లాంగ్ టర్మ్ బందీలుగా ఎవరూ లేరని స్పష్టమైంది. ఈ ఘోర పరాజయం తర్వాత భారత సైన్యం తనను తాను పూర్తిగా మార్చుకుంది. పర్వత యుద్ధ వ్యూహాలు, ఆధునిక ఆయుధాలు, లాజిస్టిక్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి.. నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా ఎదగడానికి 1962 నాటి చేదు అనుభవమే కారణమైంది. కానీ, ఆ యుద్ధం మిగిల్చిన శోకం మాత్రం వేలాది కుటుంబాల గుండెల్లో ఎప్పటికీ ఒక ఆరని గాయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+