కార్నర్: అసెంబ్లీలో ఏడ్చేసిన ఒమర్ అబ్దుల్లా
బారాముల్లాలో నిరసనల సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సైనికాధికారులు తమ ఇళ్లను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన ప్రదర్శనకు దిగారు. సైనికులపైకి రాళ్లు రువ్వారు. దీంతో సైనికులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు.
సైన్యం అవసరం లేని చోట సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం అమలును ఉపసంహరించాలని అబ్దుల్లా చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల ఒత్తిడికి ఏడ్చేసిన ఒమర్ అబ్దుల్లా ఉద్వేగం నుంచి బయటపడడానికి చాలా సమయమే తీసుకున్నారు. భద్రతా బలగాలు అమాయకులను మట్టుపెడుతుండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవసరం లేని చోటి నుంచి భద్రతా బలగాలను ఉపసంహరించే విషయంపై కేంద్రంతో తాను చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్గడ్లో దంతేవాడలో నక్సలైట్లు భారత వైమానిక దళ హెలికాప్టర్పై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ అక్కడ సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టాన్ని అమలు చేయనప్పుడు ఇక్కడ ఎందుకు చేయాలని అడిగారు. తాను రాజకీయాలు చేయడం లేదని, సమస్యను రాజకీయం చేయడం లేదని ఆయన చెప్పారు.