వెళ్లొచ్చు, సాక్ష్యులతో మాట్లాడొద్దు: సాయికి అనుమతి
రైతుల నుంచి చవకగా భూములు కొని వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్న ఎమ్మార్పై ఆదాయపన్ను శాఖ దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. గజం రూ.5 వేలకే అమ్మినట్లు లెక్కలు చూపి, అనధికారకంగా రూ. 50 వేల వరకు విక్రయించినట్లు 15 మందిపై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది.
ఇలా ఆర్జించిన అదనపు ఆదాయం వివరాలను తెలుసుకుని, సంబంధిత వ్యక్తుల నుండి పన్ను వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సిబిఐ సహకారం కోరింది. ఈ కేసులో ఇప్పటికే నాంపల్లి కోర్టులో సిబిఐ దాఖలు చేసిన మూడు చార్జిషీట్లు, వాంగ్మూలాలు, ఇతర పత్రాలు ఇవ్వాలని కోరుతూ ఐటి అధికారులు సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరుగనుంది.
బెంగళూరుకు గాలి
మరోవైపు ఓఎంసి కేసు నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డిని శుక్రవారం బెంగళూరు కోర్టులో హాజరు పర్చనున్నారు. గాలి బెయిల్ పిటిషన్ పైన సిబిఐ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. వాదులు పూర్తి కాకపోవడంత విచారణను శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది.