తిన్నదంతా కక్కిస్తా, అప్పుడే వైఎస్ను నిలదీశా: బాబు

కొల్లేరులో బాంబులు పెట్టి చెరువులను ధ్వంసంచేసే హక్కు ఎవరిచ్చారని అప్పట్లోనే తాను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని నిలదీశానని చెప్పారు. ఇక్కడ కాదు.. కొల్లేరు ప్రజల ముందు తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరానని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పేరిట అప్పటి వైయస్ ప్రభుత్వం వేల కోట్లు మేసేసిందని దుయ్యబట్టారు. మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డ కొల్లేరు ప్రజలను వైయస్ అన్నివిధాలా వంచించారని ధ్వజమెత్తారు.
అధికారంలోకి వస్తే కాంటూరును ఫ్లస్ త్రీకి కుదించి అక్రమంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాల చెరువులను పేదలకు పంచుతానని హామీ ఇచ్చారు. కొల్లేరులో చెరువులను బాంబులతో ధ్వంసం చేసి ఆ పాపాన్ని వైయస్ తమకు అంటకట్టే ప్రయత్నం చేశారని, అప్పట్లో ప్రజలు కూడా దాన్ని నమ్మారని, కొన్నాళ్ళకు వాస్తవాలు వెల్లడయ్యాయని చెప్పారు. దాళ్వాకు నీరు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం మొండి కేస్తుందని, డెల్టా ఆధునికీకరణ పేరిట రూ.4,600 కోట్ల నిధులు నీటి పాలు చేసి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తే కాంగ్రెసు పార్టీ అవినీతిలో ముందుకు తీసుకు వెళ్లిందని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డిది దోపిడీ కుటుంబమని మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి రాగానే రైతుల రుణ మాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications