జగన్తో పార్టీ పెట్టించింది కాంగ్రెస్సే, కుమ్మక్కు: కెటిఆర్

తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారమే పరమావధిగా భావించి విజయమ్మ మద్దతుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. 2004, 2009లో రెండుసార్లు గెలిచిన కాంగ్రెసు 2014లో మూడోసారి అధికారంలోకి రాలేమేమోనని భావించి జగన్తో పార్టీ పెట్టించినట్లుగా తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
కాంగ్రెసుకు మద్దతిస్తామని చెప్పడం ద్వారా కాంగ్రెసుకు వ్యతిరేకంగా వారికి మద్దతు పలికిన ప్రజలను జగన్ పార్టీ మోసం చేస్తోందన్నారు. స్వప్రయోజనాల కోసమే వైయస్సార్ కాంగ్రెసు అధికార పార్టీతో కలిసేందుకు సిద్ధమవుతోందన్నారు. ఢిల్లీ కాంగ్రెసు, చంచల్గూడ కాంగ్రెసు, తెలుగు కాంగ్రెసులతో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొడుకున ముఖ్యమంత్రిని చేసేందుకు విజయమ్మ కాంగ్రెసుకు వంత పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇది దిగజారుడుతనమే అని విమర్శించారు.
రోజూ కాంగ్రెసును దుమ్మెత్తిపోసే వైయస్ విజయమ్మ తన అల్లుడు, కొడుకును రక్షించుకునేందుకే మళ్లీ ఆ పార్టీతో కలిసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. అధికారం కోసం కాంగ్రెసు, జగన్లు కలిసేందుకు సిద్ధంగా ఉండటం దారుణమన్నారు. చంద్రబాబు తన పాదయాత్రలో గొంతు చించుకున్నా ప్రజలు నమ్మరన్నారు. బాబు కిరణ్ ప్రభుత్వం పైన అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెసుకు ఆయన ఆపద్బాంధవుడు అన్నారు.












Click it and Unblock the Notifications