విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినం కనిపించింది. విదేశాల్లోను శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రముఖ శైవ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ, కోటప్పకొండ, శ్రీకాళహస్తి భక్తులతో కిటకిటలాడాయి. అన్ని గుళ్లలోను శివనామస్మరణ మారుమోగింది.
కృష్ణా తీరంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇంద్రకీలాద్రి వద్ద దుర్ఘాఘాట్తో పాటు సీతమ్మవారి పాదాల ఘాట్, భవాని ఘాట్, పున్నమి ఘాట్లలో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానమాచరించారు. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసాన్ని ఖర్జూర తదితర పదార్థాలతో విడిచి పెట్టారు.
రాత్రి జాగారం చేసిన పలువురు భక్తులు శివుడిని భజనలతో స్తుతించారు. గుంటూరు జిల్లాలోని కోటప్పకొండపై ఉన్న త్రికోటేశ్వరస్వామి వారిని దర్సించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. అర్ధరాత్రి వరకు లింగోద్భవ అభిషేకాలు చేశారు. మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
పలువురు నేతలు స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి దానం నాగేందర్ కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలో అమృతోత్పాదన సమయంలో.. ఆవిర్భవించిన కాలకూట విషాన్ని కంఠాన ధరించి సృష్టిలోని జీవకోటిని రక్షించిన సంర్వాంతర్యామి ఈశ్వరుడు ఇంద్ర వాహనంపై ఊరేగారు.

ఆలయంలో శివుడికి భక్తుల పూజలు.

ఒడిశాలో ఓ శివాలయంలో

హర హర మహాదేవ.. ఆలయంలో భక్తుల అభిషేకం

మహంకాలీ కొలువై ఉన్న ఉజ్జయిని నగరం

అలహాబాదులో శివభక్తుడు

శివుడికి భక్తుడి పూజలు

వారణాశిలో భక్తుల కోలాహలం

అలహాబాదులో పుణ్యస్నానం చేస్తున్న సాధువు

కాశీ విశ్వేశ్వర మందిరం కిటకిట

కూటి కోసం శివుడి రూపంలో...

పాటియాలోలో

హరిద్వారలో

పాటియాలాలో శివుడికి విదేశీ భక్తురాలు అభిషేకం

దక్షిణాఫ్రికాలోని బెనోనిలో శనివారం ప్రతిష్టించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అర్ధనారీశ్వర విగ్రహం. శివరాత్రి సందర్భంగా శివుడికి హెలికాప్టర్ ద్వారా పుష్పాభిషేకం చేశారు. 9 మంది కళాకారులు పది నెలలు శ్రమించి 90 టన్నుల ఉక్కుతో 20 మీటర్ల ఎత్తైన ఈ విగ్రహానికి ప్రాణం పోశారు.

అమృత్సర్లో భక్తుల కోసం భారీ కేక్

శివుడిని స్మరిస్తున్న భక్తురాలు

విశాఖలో ఎంపి సుబ్బిరామిరెడ్డి పూజలు
మరోవైపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాకుంభమేళాలో భక్తులు పోటెత్తారు. త్రివేణిసంగమంలో లక్షలాదిమంది పుణ్యస్నానాలాచరించారు. రైల్వే శాఖ మంత్రి పవన్కుమార్ బన్సల్ కూడా ఆదివారం పుణ్యస్నానాలాచరించారు. గంగా నదీతీరంలోని దేవాలయాలన్నీ భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. శివలింగాలకు రుద్రాభిషేకాలు నిర్వహించారు.
శివనామ స్మరణతో ఆయా ప్రాంతాలు మారుమోగాయి. కాగా ప్రపంచంలోని అతిపెద్ద మత కార్యక్రమం కుంభమేళా ఆదివారంతో ముగిసింది. గత అరవైరోజులుగా కొనసాగిన ఈ మహోత్సవంలో సుమారు 12 కోట్లమంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలాచరించారని ఓ అంచనా. గత నెల 10వతేదీన మౌని అమావాశ్య సందర్భంగా ఆ ఒక్కరోజే మూడు కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications