దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల ప్రభావం తెలంగాణపై లేదు: షిండే

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల ప్రభావం తెలంగాణ అంశంపై లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. తెలంగాణపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణపై 30 రోజుల్లో నివేదిక ఇస్తానని చెప్పానని, ఆ మేరకు నివేదిక సమర్పించానని, దానిపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ డిమాండ్ చాలా కాలంగా ఉందని ఆయన అన్నారు.

ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసు ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్యపై సుశీల్ కుమార్ షిండే స్పందించారు. రాంసింగ్ ఆత్మహత్యపై విచారణ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రాంసింగ్ ఆత్మహత్యపై తీహార్ జైలు అధికారులు షిండేకు నివేదికను సమర్పించారు.

ఎన్‌సిటిసీ అంశంపై అన్ని రాష్ట్రాలకు లేఖలు రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదులు దాడులపై దర్యాప్తు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయని ఆయన అన్నారు. దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో పురోగతి ఉందని చెప్పారు.

దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల ఘటనలో సైకిల్ స్కెచ్‌లను పోలీసులు విడుదల చేశారు. విడిభాగాలను కొని నిందితులు సైకిళ్లను తయారు చేశారని సైబరాబాద్ పోలీసు కమీషనర్ చెప్పారు. సైకిళ్లు వెనకభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, దీన్ని బట్టి బాంబులను క్యారియర్లపై పెట్టినట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+