ఏప్రిల్ 19న బాబు యాత్ర ముగింపు: ముందస్తు కోసమే
ఆ మరుసటి రోజు(ఏప్రిల్ 20) చంద్రబాబు పుట్టిన రోజు. దీంతో ఏప్రిల్ 19వ తేదిన చంద్రబాబు తన పాదయాత్రను ముగించనున్నారు. ఏప్రిల్ 20వ తేదిన విశాఖపట్నంలో తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకొని హైదరాబాదుకు బయలుదేరుతారు. మిగిలిన ఆరు జిల్లాల్లో ఆయన బస్సు యాత్ర చేయనున్నారు.
ముందస్తు వ్యూహం
కేంద్రంలో యూపిఏ, రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని లాక్కొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు రావొచ్చునని తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండే ఉద్దేశ్యంలో భాగంగా కూడా చంద్రబాబు తన పాదయాత్రను ముగించనున్నట్లుగా చెబుతున్నారు.
అవిశ్వాస తీర్మానంపై సమాలోచనలు
త్వరలో రెండో విడత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంపై సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై పార్టీలో చర్చ సాగుతోందని సమాచారం. ఓసారి అవిశ్వాస తీర్మానం పెట్టాక ఆరు నెలల వరకు ఆ అవకాశం లేదు.