వస్తున్నారా? రానంటే రాను: డికె అరుణ వర్సెస్ జానా

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జానా రెడ్డిలు వస్తున్నారు. అయితే, ఈ విషయంపై డికె అరుణకు ఇప్పటి వరకు సమాచారం లేదట. ఈ రోజు లాబీల్లో కనిపించిన డికె అరుణతో జానా రెడ్డి.. శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారా అని ప్రశ్నించారట. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన డికె అరుణ తాను రానని ఖరాఖండింగా చెప్పేసినట్లుగా సమాచారం.
జిల్లాకు చెందిన మంత్రిని అయిన తనకు ఇప్పటి వరకు ఈ కార్యక్రమం గురించి తెలియక పోవడమేమిటని ఆమె జానాను ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. కార్యక్రమానికి నాలుగు రోజుల ముందు చెప్పడమేమిటని ఆమె ప్రశ్నించారట. దీంతో, మీకు వీలుగా ఉన్న మరో తేదీ చూపిస్తే అదే రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టుకుందామని జానా రెడ్డి సూచించారట.
అందుకు డికె అరుణ ససేమీరా అన్నట్లుగా తెలుస్తోంది. తనకు ఇప్పటి వరకు చెప్పలేదని, అలాంటప్పుడు తాను కార్యక్రమానికి వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారట. డికె అరుణకు చెప్పక పోవడంపై జిల్లాకు చెందిన ఆమె వర్గం నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.












Click it and Unblock the Notifications