మళ్లీ తడబడిన జగన్ పార్టీ: పెద్దిరెడ్డికి గ్రాండ్ వెల్కం
కాంగ్రెసు పార్టీ చిహ్నమైన టోపీలు ధరించి తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చారని, ఇది చంద్రబాబు నాయుడు అధికార పార్టీతో కుమ్మక్కవుతున్నారనేందుకు నిదర్శనమన్నారు. దీనిపై స్పందించిన మీడియా.. అవి మహాత్మా గాంధీ టోపీలు అని అవి ధరిస్తే కాంగ్రెసు టోపీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే కూడా అదే టోపీని ధరిస్తున్నారని మీడియా చెప్పింది.
మీడియా ప్రశ్నలకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటు వేసిందని, అలాంటప్పుడు టిడిపి కుమ్మక్కైందని ఎలా చెబుతారని మీడియా ప్రశ్నించింది. దానికి నేరుగా సమాధానం ఇవ్వకుండా తాము ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాత్రమే ఓటు వేశామని చెప్పి అక్కడ నుండి తప్పుకున్నారు.
పెద్దిరెడ్డికి తిరుపతిలో ఘన స్వాగతం
అవిశ్వాస తీర్మానం సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతిచ్చిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. అవిశ్వాస తీర్మానం తర్వాత ఆయన మొదటిసారి జిల్లాకు వెళ్లారు. జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. పెద్దిరెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు.