మొదట ముగ్గురే రాజీనామా: దిగొచ్చిన అళగిరి తర్వాత..
అళగిరిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. స్టాలిన్ను తన వారసుడిగా తండ్రి కరుణానిధి ప్రకటించడంపై రగిలిపోతున్న అళగిరి తిరుగుబాటుకు సిద్ధమైనట్లు భావించారు. మరో ఇద్దరు రాజనామా చేయకపోవడానికి కారణమేమిటనే విషయంపై టిఆర్ బాలు ప్రతిస్పందిస్తూ తమలో విభేదాలు లేవని, మిగతా ఇద్దరు తర్వాత రాజీనామాలు సమర్పిస్తారని చెప్పారు. తమ రాజీనామాలను ప్రధాని అంగీకరించినట్లు ఆయన తెలిపారు.
రెండు డిమాండ్లను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ యుపిఎ నుంచి వైదొలిగే విషయంలో వెనక్కి తగ్గేది లేదని కరుణానిధి చెబుతున్నారు. ఈ వారాంతంలో జెనీవాలో ఐక్యరాజ్య సమితి (యుఎన్) శ్రీలంకలోని తమిళుల విషయంలో పెట్టే తీర్మానంపై సవరణలు ప్రతిపాదించడానికి కాంగ్రెసు ముందుకు వచ్చినా కరుణానిధి తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అటువంటి తీర్మానాన్నే పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది.
కరుణానిధికి ఫోన్ చేయడంతో 2003లో కాంగ్రెసుతో డిఎంకె పొత్తుకు సిద్ధపడింది. ప్రస్తుతం డిఎంకెకు 18 మంది పార్లమెంటు సభ్యులున్నారు. లోకసభ ఎన్నికల తర్వాత రెండేళ్లకు 2011లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిఎంకె ఘోరంగా ఓటమి పాలైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరుణానిధి కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.