వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహంపై ఒక్కరికేనా?: పురంధేశ్వరితో బాబు ఢీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari-Chandrababu Naidu
న్యూఢిల్లీ/రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరిని మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్పీకర్ మీరా కుమారి అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పీకర్‌కు లేఖ రాశారు. ఎన్టీఆర్ విగ్రహంతో పాటు మన్నెం వీరుడు అల్లూరి సీతారామ రాజుల విగ్రహాలను పార్లమెంటులో ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని తాము రెండుసార్లు లేఖ రాసినా స్పందించలేదన్నారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసే అవకాశం ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి లేదా ఆయన కుటుంబానికి ఇవ్వాలన్నారు. అలాకాకుండా ఓ వ్యక్తికి ఇవ్వడమేమిటని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించి విగ్రహ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.

టిడిపి తరఫునే...

పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తమ పార్టీకే అవకాశం ఇవ్వాలని టిడిపి ఎంపీలు నామా నాగేశ్వర రావు కోరారు. ఆయన చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్‌తో పాటు అల్లూరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కరికే అవకాశం ఇవ్వడం సరికాదన్నారు. పార్టీకి లేదా కుటుంబానికి ఇవ్వాలని ఆయన కోరారు.

విద్యుత్ సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్రానికి గ్యాస్, బొగ్గు కేటాయించాలని నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో లభ్యమయ్యే గ్యాస్, బొగ్గు మనకు కేటాయించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has wrote a letter to Lok Sabha speaker about late Nandamuri Taraka Rama Rao statue issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X