ఎన్టీఆర్ విగ్రహంపై ఒక్కరికేనా?: పురంధేశ్వరితో బాబు ఢీ

Purandeswari-Chandrababu Naidu
న్యూఢిల్లీ/రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరిని మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్పీకర్ మీరా కుమారి అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పీకర్‌కు లేఖ రాశారు. ఎన్టీఆర్ విగ్రహంతో పాటు మన్నెం వీరుడు అల్లూరి సీతారామ రాజుల విగ్రహాలను పార్లమెంటులో ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని తాము రెండుసార్లు లేఖ రాసినా స్పందించలేదన్నారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసే అవకాశం ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి లేదా ఆయన కుటుంబానికి ఇవ్వాలన్నారు. అలాకాకుండా ఓ వ్యక్తికి ఇవ్వడమేమిటని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించి విగ్రహ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.

టిడిపి తరఫునే...

పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తమ పార్టీకే అవకాశం ఇవ్వాలని టిడిపి ఎంపీలు నామా నాగేశ్వర రావు కోరారు. ఆయన చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్‌తో పాటు అల్లూరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కరికే అవకాశం ఇవ్వడం సరికాదన్నారు. పార్టీకి లేదా కుటుంబానికి ఇవ్వాలని ఆయన కోరారు.

విద్యుత్ సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్రానికి గ్యాస్, బొగ్గు కేటాయించాలని నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో లభ్యమయ్యే గ్యాస్, బొగ్గు మనకు కేటాయించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+