వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్జల్ గురు ఉరి తర్వాత యాకూబ్ ఉపవాసం

By Pratap
|
Google Oneindia TeluguNews

Yakub Memon
నాగపూర్: పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత యాకూబ్ మెమొన్ రోజుల తరబడి భోజనం చేయలేదని తెలుస్తోంది. అతను కటిక ఉపవాసం చేశాడని అంటున్నారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో యాకూబ్ మెమొన్‌కు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. అఫ్జల్ గురను ఉరితీసిన తర్వాత మూడు రోజుల పాటు యాకూబ్ మెతుకు కూడా ముట్టలేదట.

తనకు ఉరిశిక్ష వేస్తూ సుప్రీం తీర్పు చెప్పిన తర్వాత యాకూబ్ ఏమాత్రం లెక్కచేయకుండా గంభీరంగా మారిపోయాడు. అఫ్జల్ గురును ఉరితీసిన సమయంలో యాకూబ్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. అఫ్జల్‌ను ఉరితీసిన తర్వాత మూడు రోజుల పాటు యాకూబ్ కఠిన ఉపవాసం చేశాడని చెబుతున్నారు.

జైలులో మేగజైన్లు, పుస్తకాలు చదువుతూ, జైలు అధికారులతో పలు విషయాలపై లోతుగా చర్చించడానికి ఆసక్తి చూపే యాకూబ్, తనకు ఉరిశిక్ష పడినా చలించలేదు. కానీ అఫ్జల్ ఉరితో అంతగా చలించిపోవడం అంతుబట్టనిదేనని జైలు అధికారులు అంటున్నారు.

యాకూబ్ మెమొన్ తెల్ల దుస్తులు ధరించడానికే ఇష్టపడుతున్నాడట. తన కేసు విషయంలో ఏం జరగనుందో యాకూబ్‌కు ముందే తెలిసి ఉంటుందని అంటున్నారు. నాగపూర్ సెంట్రల్ జైలులో చివరిసారి 1984లో ఉరిశిక్ష అమలైంది. హత్య కేసులో అమరావతికి చెందిన వాంఖడే సోదరులకు ఉరిశిక్ష అమలు చేశారు.

English summary
A senior source in the jail said the only time they his disturbance writ large on an otherwise unflappable Yakub's calm exterior was when Parliament attacker Afzal Guru was hanged. Yakub had then remained away from food for three days and the amicable man withdrew into his shell.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X