జగన్: ఎమ్మెల్యేలకు బొత్స క్లాస్, తెలంగాణపై పాల్వాయి

అటు ఇటు అంటూ ఊగిసలాట సరికాదని, 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని వారికి బొత్స చెప్పారట. అలా చేయడం వల్ల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారట. పార్టీలో, నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వారిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
జగన్ పార్టీ ప్రస్తుతం సెంటిమెంట్ పైన నడుస్తోందని, సాధారణ ఎన్నికల నాటికి ఆ పరిస్థితి ఉండదని హితబోధ చేశారట. పార్టీకి ద్రోహం చేయడం సరికాదని చెప్పారట. అదే సమయంలో అంతగా ఇష్టం లేకపోతే కాంగ్రెసును వీడవచ్చునని, ఊగిసలాట మాత్రం వద్దని చెప్పారట. కాగా, బొత్స క్లాస్ తీసుకున్నది నిన్న వెళ్లాలనుకుంటే ఎవరు అడ్డుకోలేరన్న సుధీర్ రెడ్డితో పాటు శ్రీశైలం గౌడ్కు క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ తేల్చకుంటే..
జూన్ పదిహేను లోగా తెలంగాణపై కేంద్రం నుండి ఓ నిర్ణయం వచ్చే అవకాశముందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మే లేదా జూన్ నెలల్లో తెలంగాణకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం రాకుంటే పార్టీలోని తెలంగాణ ప్రాంత నేతలు ఎవరి నిర్ణయాలు వారు తీసుకునే అవకాశముందన్నారు.
తెలంగాణపై సానుకూల ప్రకటన రాకుంటే రాజకీయంగా బతకాలనుకున్న వాళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పార్టీలో కోమటిరెడ్డి సోదరులతో పాటు మరో ఇద్దరు ఇంటి దొంగలు ఉన్నారన్నారు. మంత్రులు జానా రెడ్డి, జైపాల్ రెడ్డిలు రాజీనామా చేయరని జోస్యం చెప్పారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications