టూరిజం బస్సుపై దాడి: భార్యను చంపిన భర్త ఆత్మహత్య
దీంతో అతను తిరిగి బస్సు ఎక్కుతుండగా పదిహేను మంది వరకు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, కర్రలతో బస్సుపై దాడి చేశారు. ఇది గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సు ఎక్కి వేగంగా పోనిచ్చాడు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన షోలాపూర్ సమీపంలో జరిగింది. డ్రైవర్, ప్రయాణీకుల దగ్గర్లోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదని పోలీసులు నిరాకరించారు. దీంతో ఈరోజు హైదరాబాద్ వచ్చాక ఇక్కడ ఫిర్యాదు చేశారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ కాలనీలో బుధవారం ఉదయం ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తలించారు.
తూర్పు గోదావరి జిల్లాలో నరసాపురం నుండి సఖినేటిపల్లి వస్తున్న ఓ పడవ సాంకేతిక లోపంతో గోదావరి మధ్యలో చిక్కుకుపోయింది. బోటులో దాదాపు వందమంది ప్రయాణీకులు ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
భార్యను చంపిన భర్త ఆత్మహత్య
మంగళవారం ఢిల్లీ మెట్రో స్టేషన్లో భార్యపై కాల్పులు జరిపి ఆమె మరణానికి కారణమైన పవన్ కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. యుపి మురాద్ నగర్లో ఓ రైల్వే స్టేషన్ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని అతను ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తల మధ్య ఆస్తి వివాదమే ఈ ఆత్మహత్య, హత్యకు కారణంగా తెలుస్తోంది. కోర్టు నుండి బయటకు వచ్చి ఇంటికి వెళ్తుండగా పవన్ తన భార్య, మామలపై కాల్పులు జరిపినట్లుగా సమాచారం.