గుంటూరు సాఫ్టువేర్ ఇంజనీర్ అమెరికాలో అదృశ్యం
నయగారా జలపాతం చూసి తిరిగి వస్తున్న అతను వాషింగ్టన్ డిసిలో అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. అతను చికాగోలోని టిసిఎస్లో కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం. శరత్ తిరిగి రాకపోవడంతో సహచరులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరులోని కుటుంబ సభ్యులు, అతని బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అతని కోసం గాలిస్తున్నారు.
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థులు నాసా స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ కాంటెస్ట్ 2013 పోటీలుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది 14 ప్రాజెక్టులతో 36 మంది ఎంపికై రికార్డు సృష్టించారు. నూజివీడు ట్రిపుల్ ఐటి నుంచి విద్యార్థులకు నాసాకు ఎంపిక కావడం ఇది వరుసగా నాలుగోసారి. నాసా పోటీలకు ట్రిపుల్ ఐటి నుంచి మొత్తం 20 ప్రాజెక్టులు పంపగా వాటిలో 14 ఎంపికయ్యాయి.
గ్రేడ్ 11 విభాగంలో లక్ష్మీ ప్రసన్న రూపొందించిన టైటాన్(ది డ్రీమ్ వరల్డ్) ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి వచ్చింది. గ్రేడ్ 12 విభాగంలో అమరాంతన్కు ద్వితీయ, అక్రాన్కు తృతీయ బహుమతులు లభించాయి. మే నెలలో 23-25 తేదీలలో వీరు తమ ప్రాజెక్టులను వివరించడానికి యూఎస్ఏ వెళ్లాల్సి ఉంటుంది.