కిరణ్ రెడ్డికి విజయమ్మ సవాల్: తీవ్ర అస్వస్థత

ప్రతిపక్షాల కన్నీరు వరదలై పారుతోందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆమె అన్నారు. ప్రజల కన్నీటి వరదలో ఇటువంటి ముఖ్యమంత్రులు కొట్టుకుపోతారని ఆమె వ్యాఖ్యానించారు. కరెంట్ సమస్యపై రెఫరెండానికి ముఖ్యమంత్రి సిద్ధపడాలని ఆమె సవాల్ చేశారు. ప్రజల కోసమే తాము దీక్ష చేస్తున్నామని ఆమె చెప్పారు.
తమ దీక్షను ముఖ్యమంత్రి ఎగతాళి చేస్తున్నారని, ఆమె అన్నారు. కరెంట్ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్దామని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలుతుందని ఆమె అన్నారు. ఇప్పుడంతా బాగుందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని ఆమె అడిగారు. పల్లెలకు వెళ్తే ప్రజల కరెంట్ కష్టాలు ముఖ్యమంత్రికి తెలుస్తాయని ఆమె అన్నారు. ప్రజా బ్యాలెట్కు మంచి స్పందన లభిస్తోందని ఆమె చెప్పారు. ఈ నెల 9వ తేదీన జరిగే బంద్ను విజయవంతం చేయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. దీక్ష విరమించే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు.
గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న వైయస్ విజయమ్మ శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పార్టీ శాసనసభ్యులు సుచరిత, గుర్నాథ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నారు. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో శోభా నాగిరెడ్డి, సుజయ కృష్ణా రంగారావు కుప్పకూలారు. గొట్టిపాటి రవికుమార్, జోగి రమేష్, బాలినేని శ్రీనివాస రెడ్డి, అమర్నాథ్ రెడ్డిల బిపి లెవెల్ పడిపోయింది. దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నీరసించిపోయారు. ఆరోగ్యం క్షీణించడంతో శానససభ్యురాలు వనితను ఆస్పత్రికి తరలించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications