వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెరిటేజ్ ప్లాంట్‌లో ప్రమాదం: భార్యను చంపి భర్త సూసైడ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Fire accident in Vishaka
విశాఖపట్నం/హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా కాశీంకోట మండలం బయ్యవరం వద్ద గల హెరిటేజ్ డెయిరీ ప్లాంటులో ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. డెయిరీ బాయిలర్ పేలింది. ఈ పేలుడులో ముగ్గురు ఒప్పంద కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. డెయిరీ సిబ్బంది వారిని దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ముగ్గురు చనిపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

విశాఖ స్టీల్ ప్లాంటులో బ్లాస్ట్ ఫర్నేస్ 3 విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని విశాఖ స్టీల్ యాజమాన్యం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించింది. గాయపడ్డ వారిలో అసిస్టెంట్ మేనేజర్, టెక్నిషియన్లు, కళాసి, కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ దుకాణంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి దొంగలు లోపలకు ప్రవేశించి భారీగా బంగారం, వెండి నగలను దోచుకెళ్లినట్లు పోలీసులకు బాధితుడు తెలిపారు. పోలీసులు క్లూస్ వివరాలను సేకరిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. దెందులూరుకు చెందిన ఈ మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసి గుడిసెలోకి వ్యాపించాయి. వెంటనే గ్రామస్తులు మంటలను అదుపు చేసినా మహిళను రక్షించలేకపోయారు.

చిత్తూరు జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ భర్త భార్య గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవరం గ్రామంలో ఈ దారుణం జరిగింది.

English summary
Fire accident occured in Vishaka distict Kasimkota Heritage dairy plant on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X