హెరిటేజ్ ప్లాంట్లో ప్రమాదం: భార్యను చంపి భర్త సూసైడ్
విశాఖ స్టీల్ ప్లాంటులో బ్లాస్ట్ ఫర్నేస్ 3 విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని విశాఖ స్టీల్ యాజమాన్యం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించింది. గాయపడ్డ వారిలో అసిస్టెంట్ మేనేజర్, టెక్నిషియన్లు, కళాసి, కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ఓ దుకాణంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి దొంగలు లోపలకు ప్రవేశించి భారీగా బంగారం, వెండి నగలను దోచుకెళ్లినట్లు పోలీసులకు బాధితుడు తెలిపారు. పోలీసులు క్లూస్ వివరాలను సేకరిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. దెందులూరుకు చెందిన ఈ మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసి గుడిసెలోకి వ్యాపించాయి. వెంటనే గ్రామస్తులు మంటలను అదుపు చేసినా మహిళను రక్షించలేకపోయారు.
చిత్తూరు జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ భర్త భార్య గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవరం గ్రామంలో ఈ దారుణం జరిగింది.