ఎన్టీఆర్పై జగన్ వర్సెస్ టిడిపి: స్పందించిన పురంధేశ్వరి
భారత దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ, పూలే ఎలాగో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా అంతేనని ఆమె అన్నారు. కృష్ణా జిల్లా ఫ్లెక్సీ వివాదాల విషయంలో తాను ఇంతకు మించి ఏమీ మాట్లాడలేనని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.
తమ తండ్రి ఎన్టీఆర్ ఫొటోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఫ్లెక్సీల్లో వాడుకోవడంపై హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ తీవ్రంగా మండిపడ్డ విషయం తెలిసిందే. వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మకు ఓట్లు రాలవని భావించి, ఎన్టీ రామారావుకు బొమ్మకు ఓట్లు రాలుతాయని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు అనుకుంటున్నారని, అందుకే ఎన్టీ రామారావు బొమ్మను వాడుకుంటున్నారని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ బొమ్మను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకోవడం సరి కాదని, చట్టబద్ధం కూడా కాదని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు ఓ పార్టీ వ్యవస్థాపకుడని, అందువల్ల అలా వాడుకోవడం తగదని ఆయన అన్నారు. కృష్ణుడి ఫొటో అనుకోండి అది ఎవరైనా వాడుకోవచ్చు గానీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు ఫొటోను మరో పార్టీ వాడుకోవడం సరి కాదని ఆయన అన్నారు.