గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంషాబాద్ ఏర్ పోర్టులో రెండు గన్స్, బుల్లెట్లు స్వాధీనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Two men with air guns in Shamshabad air port
హైదరాబాద్/గుంటూరు: శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి కస్టమ్స్ అధికారులు రెండు ఎయిర్ గన్స్‌ని, 400 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. వారు నిన్న దుబాయ్‌లో దుబాయ్ ఎమిరేట్స్ విమానం ఎక్కారు. ఉదయం శంషాబాదులో దిగారు. తనిఖీలలో భాగంగా వారి నుండి కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని వారిని విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. వాటి నుండి ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో పోలీసులు వారిని విడిచిపెట్టినట్లుగా సమాచారం.

కానిస్టేబుల్ ఆత్మహత్య

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్ నగర్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్ రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

గుప్తనిధుల కోసం తవ్వకాలు

విశాఖపట్నం జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. భీమిలి సమీపంలోని అతిపురాతన నరసింహ స్వామి వారి ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు.

వ్యక్తి హత్య

కడప జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary

 Shamshabad customs officers found two men with air guns on Monday morning. The two men came from Dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X