ఎన్టీఆర్ ఫోటో: పురంధేశ్వరికి తెలుగుదేశం పార్టీ సలహా
కానీ, ఆ మహానేత ఫొటోలను కాంగ్రెస్ నేతల చేతుల్లో పెట్టవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే అప్పట్లో ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లని కుక్క మూతి పిందెలు అని ఎన్టీఆర్ విమర్శించేవారని, అధికారం కోసం అలాంటి పార్టీలో చేరిన పురందేశ్వరిని ఏమనాలో ఆమే చెప్పాలని కోరారు.
ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకొనే హక్కు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి శనిగ్రహం లాంటిదని, ఎన్టీఆర్ మరణానికి ఆమే కారణమని విమర్శించారు. ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి రాకపోయి ఉంటే ప్రధాన మంత్రో, రాష్ట్రపతో అయ్యేవారన్నారు.
సబితాపై మేం విజయం సాధించాం.. పయ్యావుల
అవినీతిపై తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేయడం వల్లే మంత్రుల అవినీతి బాగోతాలు బయటపడ్డాయని, మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కేసు నమోదు అందులోభాగమని టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఓబులాపురం గనుల్లో అక్రమాలు జరిగాయని తమ పార్టీ నాయకులు ఎర్రన్నాయుడు, అశోక్గజపతిరాజు తదితరులు అనేకసార్లు పోరాటాలు చేసిన విషయం గుర్తుచేశారు. సిబిఐ చార్జిషీట్లోని మంత్రులను బర్తరఫ్ చేయాని డిమాండ్ చేశారు. కేబినెట్ నుంచి తొలగించి విచారణ చేపట్టాలని సీఎం, గవర్నర్లను కోరారు.