వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవితో భేటీ వార్తలపై నటి ఖుష్బూ గుర్రు

By Pratap
|
Google Oneindia TeluguNews

Khushboo
చెన్నై: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచుగా వార్తల్లోకి ఎక్కే ప్రముఖ నటి ఖుష్బూ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరనుందని తమిళనాట ప్రచారం జోరందుకుంది. ఇందుకు గాను ఆమెకేంద్ర పర్యాటక మంత్రి మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఖుష్బూ త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనుందని ఊహాగానాలు వెల్లువెత్తాయి.

ఆ వార్తలపై ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చిరంజీవిని కలిశానా వాట్ ఎ కామెడీ అని వ్యాఖ్యానించారు. తాను చిరంజీవితో భేటీ అయినట్లు, కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖుష్బూ కొట్టిపారేశారు.

ప్రస్తుతం డీఎంకేలో ఉన్నానని, అదే పార్టీలోనే కొనసాగుతానని ఖుష్బూ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఖుష్బూ చెప్పారు. కాగా ఇటీవల డీఎంకే వారసత్వంపై ఖుష్బూ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

స్టాలిన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆయన వర్గానికి చెందిన డిఎంకె కార్యకర్తలు ఆమెపై దాడి చేశారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఖుష్బూ ఏదో రకంగా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటున్నారు.

English summary

 Actress Khushboo has confemned the reports of her meeting with union minister megastar Chiranjeevi. She said that she is in DMK at present in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X