వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను, కూతురిని హత్య చేసిన భారతీయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Italy Flag
రోమ్: తన భార్యను, కూతురిని హత్య చేసిన ఓ భారతీయుడిని ఇటలిలో పోలీసులు అరెస్టు చేశారు. కుమార్ రాజ్ (37) అనే వ్యక్తి 56 ఏళ్ల తన భార్య ఫాన్సిస్కా డీ గ్రాజియాను, 19 ఏళ్ల ఆమె కూతురు మార్టినాను కత్తితో పొడిచి హత్య చేశాడు. కుమార్ రాజ్ తన నేరాన్ని అంగీకరించాడు. సెంట్రల్ ఇటలీలోని ఫ్లోరా విలేజ్‌లో గత శనివారం అతను ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు.

డబ్బు వ్యవహారంలో వివాదం చెలరేగడం వల్ల తాను ఈ దారుణానికి పాల్పడినట్లు కుమార్ పోలీసులకు చెప్పాడని స్థానిక మీడియా రాసింది. పదే పదే డబ్బు అడుగుతుండడంతో తాను విసుగు చెందినట్లు పోలీసులకు చెప్పాడు.

ఇద్దరు మహిళలను హత్య చేశాడనే అనుమానం రావడంతో పోలీసులు అదివారంనాడు అప్రిలియా సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. డి గ్రాజియా శవం ఆమె ఇంటిలోని వంటగదిలో పడి ఉంది. ఆమె గొంతుపై కత్తి గాటు ఉంది. మాజీ భర్తతో కలిగిన గ్రాజియా కూతురు గొంతుపై నాలుగు కత్తి పోట్లు కనిపించాయి. ఆమె శవం పడకగదిలో పడి ఉంది.

రాజ్ భారతదేశంలోని కురుక్షేత్రలో గ్రాజియాను 2008 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. దాంతో రాజ్‌కు ఇటలీ పౌరసత్వం వచ్చింది. వాయిదాల పద్ధతిలో 150 యూరోల చొప్పున 8 వేల యూరోలు చెల్లించడానికి అంగీకరించాడు. అయితే, ఇంకా ఎక్కువ డబ్బు కావాలని తనను గ్రాజియా వేధిస్తూ వస్తోందని రాజ్ పోలీసులకు చెప్పాడు.

రాజ్ హర్యానాలోని రామ్ శరన్ మజ్రాకు చెందిన వ్యక్తి. ఇటలీలో భవన నిర్మాణ పనుల్లో కూలిగా పనిచేస్తుంటాడు.

English summary
An Indian laborer has confessed to stabbing to death his Italian wife and her teenage daughter south of Rome in a fit of rage over money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X