భార్యను, కూతురిని హత్య చేసిన భారతీయుడు
డబ్బు వ్యవహారంలో వివాదం చెలరేగడం వల్ల తాను ఈ దారుణానికి పాల్పడినట్లు కుమార్ పోలీసులకు చెప్పాడని స్థానిక మీడియా రాసింది. పదే పదే డబ్బు అడుగుతుండడంతో తాను విసుగు చెందినట్లు పోలీసులకు చెప్పాడు.
ఇద్దరు మహిళలను హత్య చేశాడనే అనుమానం రావడంతో పోలీసులు అదివారంనాడు అప్రిలియా సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. డి గ్రాజియా శవం ఆమె ఇంటిలోని వంటగదిలో పడి ఉంది. ఆమె గొంతుపై కత్తి గాటు ఉంది. మాజీ భర్తతో కలిగిన గ్రాజియా కూతురు గొంతుపై నాలుగు కత్తి పోట్లు కనిపించాయి. ఆమె శవం పడకగదిలో పడి ఉంది.
రాజ్ భారతదేశంలోని కురుక్షేత్రలో గ్రాజియాను 2008 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాడు. దాంతో రాజ్కు ఇటలీ పౌరసత్వం వచ్చింది. వాయిదాల పద్ధతిలో 150 యూరోల చొప్పున 8 వేల యూరోలు చెల్లించడానికి అంగీకరించాడు. అయితే, ఇంకా ఎక్కువ డబ్బు కావాలని తనను గ్రాజియా వేధిస్తూ వస్తోందని రాజ్ పోలీసులకు చెప్పాడు.
రాజ్ హర్యానాలోని రామ్ శరన్ మజ్రాకు చెందిన వ్యక్తి. ఇటలీలో భవన నిర్మాణ పనుల్లో కూలిగా పనిచేస్తుంటాడు.