ఎన్టీఆర్పై విరుచుకుపడ్డ బాలకృష్ణ సేవా సమితి నేత
మంగళవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ కళాకారుడైనా, వ్యక్తులైనా ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుంటే తప్పులేదని, అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు ఆ హక్కు లేదని ఆయన అన్నారు. ప్లెక్సీల వివాదంలో నందమూరి అభిమానులను కించపరిచేలా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని పార్టీ మారి తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండడాన్ని ఆయన తప్పు పట్టారు. జూనియర్ ఎన్టీఆర్కు ఉడుకు రక్తం ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అసలు తారక మంత్రమేదో గుట్టు విప్పాలని డిమాండ్ చేశారు.
తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చెబుతూనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తన బొమ్మను ఫ్లెక్సీలో వాడుకోవడాన్ని ఖండించలేదు. ఆ రకంగా ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జూనియర్ ఎన్టీఆర్పై విరుచుకుపడ్డారు.