మత్తులో రోడ్డుపై ముంబై యువతి వీరంగం: శ్రాగ్వి క్షేమం
మాదక ద్రవ్యాలు సేవించిన సదరు యువతి రోడ్డు పైనుండి వెళ్తున్న వారిపై రాళ్ల దాడి చేసింది. వస్తున్న వారిని అడ్డుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని రోడ్డుపై వీరంగం సృష్టిస్తున్న యువతిని అదుపులోకి తీసుకున్నారు.
ఆమె ముంబైకి చెందిన ఆయేషాగా పోలీసులు గుర్తించారు. ఆయేషాను పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసు స్టేషన్లోను ఆ యువతి కాసేపు కాసేపు హల్ చల్ సృష్టించింది. ఆమెతో పాటు ఓ యువకుడు కూడా ఉన్నాడు. అతనిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని స్టేషన్లోకి తీసుకు వెళ్తుండగా ఆ యువతి హంగామా చేసింది.
చిన్నారి శ్రాగ్వి క్షేమం
నాలుగు రోజుల క్రితం అంబరుపేటలో శ్రాగ్వి అనే చిన్నారి అదృశ్యం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శ్రాగ్వి శనివారం కిడ్నాప్కు గురయింది. చిన్నారిని బంధువులే కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కుటుంబ విభేదాల కారణంగా బంధువులే ఆమెను కిడ్నాప్ చేశారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.