420 నెంబర్ ఇవ్వాలి: కిరణ్ కేబినెట్పై రేవంత్ ఎద్దేవా
డయల్ యువర్ కేబినెట్కు 420 నెంబర్ కేటాయించాలని ఆయన ఎద్దేవా చేశారు. సచివాలయంలోని సమతా బ్లాక్ను జైలుగా మార్చాలని ఆయన విమర్శలు గుప్పించారు. 420 మంత్రులను వెంటనే కేబినెట్ నుండి తొలగించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అధికారంలో కొనసాగే హక్కు లేదు
నిర్భయ బిల్లు వచ్చినప్పటికీ మహిళలపై అరాచకాలు ఆగడం లేదని టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు ఎంతమాత్రం లేదని ఆయన అన్నారు.
దాడులకు బాధ్యత వహిస్తూ సబిత రాజీనామా చేయాలి
రాష్ట్రంలో మహిళలపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి గురువారం అన్నారు. మహిళలపై దాడులకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆదుకుంటామని... జగన్ పార్టీ
అమ్మహస్తం పేరుతో ప్రజలను ఆదుకుంటామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శించింది. ఈ రోజు కిరణ్ ప్రవేశ పెట్టిన అమ్మహస్తంపై ఆ పార్టీ మండిపడింది. ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోందన్నారు. ప్రభుత్వం ధరలను ఐదువందల రెట్లు పెంచిందని ఆరోపించారు. రేషన్ సరుకులకు ప్రభుత్వం కోత పెడుతోందని ఆరోపణలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డిది ధరకాసుర పాలన అన్నారు.