Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నయగారా వద్ద ఆంధ్రా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహం

Guntur
వాషింగ్టన్: అమెరికాలో పన్నెండు రోజుల క్రితం అదృశ్యమైన గుంటూరు జిల్లా సాఫ్టువేర్ ఇంజనీర్ శరత్ కుమార్ శవమై తేలాడు. నయగారా జలపాతం వద్ద స్థానిక పోలీసులు ఓ భారతీయుడి మృతదేహాన్ని కనుగొన్నారు. ఇది శరత్ కుమార్‌గా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన శరత్ కుమార్ గత నెల 31వ తేదిన అదృశ్యమైన విషయం తెలిసిందే. చికాగోలోని టిసిఎస్ సంస్థలో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతను నయగారా జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. ఆదివారం(మార్చి 31) పర్యటన కోసం వెళ్లిన శరత్ కుమార్ ఆ తర్వాత తిరిగి రాలేదు.

నయగారా జలపాతం చూసి తిరిగి వస్తున్న అతను వాషింగ్టన్ డిసిలో అదృశ్యమయ్యారు. శరత్ తిరిగి రాకపోవడంతో సహచరులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరులోని కుటుంబ సభ్యులు, అతని బంధువులు తీవ్ర ఆందోళన పడ్డారు. ఇప్పుడు నయగారా జలపాతం వద్ద అతని మృతదేహం లభించింది.

శరత్ కుమార్ మిస్ అయ్యాడని చెప్పడంతో స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఇతని మృతదేహం లభించడంతో అతను ఎలా మరణించాడన్నది తెలియరాలేదు. ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగిపోయాడా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఆధారాలు సేకరిస్తున్నామని వివరాలు వెల్లడిస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+