ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్, బాలయ్య టిడిపి కార్యకర్తలే: తారకరత్న

By Pratap
|
Google Oneindia TeluguNews

Tarakaratna
ఖమ్మం: తమ పెద్దనాన్న నందమూరి హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ, సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రాం, తాను తెలుగుదేశం పార్టీ సామాన్య కార్తకర్తలం మాత్రమేనని సినీ హీరో తారకరత్న అన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం నెల్లిపాకలో ఆయన శుక్రవారం ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు.

ఎన్టీ రామారావు రాజకీయ వారసుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ఆయన అన్నారు. ఎన్టీఆర్ సేవా సమితి కార్యాలయాన్ని, వీధి దిపాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు నాయుడే అందరికీ ఏకైక నాయకుడని ఆయన అన్నారు.

తారకరత్న ప్రకటన చంద్రబాబు నాయుడికి కాస్తా ఊరట కలిగించినట్లే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ వివాదంలో బాలకృష్ణ తన వైపు నిలబడుతున్నప్పటికీ మిగతా నందమూరి కుటుంబ సభ్యులు ఎవరు కూడా బహిరంగంగా ముందుకు రాలేదు. తారకరత్న చేసిన ప్రకటనతో చంద్రబాబుకు కాస్తా బలం వచ్చినట్లేనని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు సాగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ ఓవైపు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ మరోవైపు నించున్నారు. ఈ వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్లీల వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

English summary
Tarakaratna has supported the Telugudesam party president Nara Chandrababu naidu in leadership tussle. He said that Balakrishna and Jr Ntr are party workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X