జగన్ బందిపోటు, జైలు వద్ద పడిగాపులు: నారాయణ

తెనాలి ఘటనలో మరణించిన సునీల కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతూ ఆయన శుక్రవారం విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెనాలిలో ఒక యువతిని వేధించి, ఆమె తల్లిని చంపడం ఘోరమని ఆయన అన్నారు.
ఈ సంఘటనను ప్రజలు చూశారు. దీనికి విచారణలు, కోర్టులు, సాక్ష్యాలు అవసరం లేదని, విచారణలు పూర్తయ్యేలోగా జడ్జిలు, పోలీసులు మాయమవుతారని, చివరికి నేరం చేసినవాడు కూడా బ్రతికి బయటకి వస్తాడని, అందుకే అత్యాచారం వంటి నేరాలు చేసిన వారిని అక్కడికక్కడే కాల్చివేస్తే భయం ఉంటుందని ఆయన అన్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితురాలిగా సిబిఐ చార్జిషీట్లో పేర్కొన్నందున హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications