జగన్పై వ్యాఖ్యలు: ఆనంపై జగన్ పార్టీ నేతల ఫైర్

వైయస్ జగన్ కేసులో ఉన్న ఆరుగురు మంత్రులను ప్రభావితం చేయడానికే ఆనం ఈ నాటకం ఆడుతున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించిన మంత్రి ఆనంనే ముందు ఉరి తీయాలని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ను భౌతికంగా లేకుండా చేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేశాయని ఆయన ఆరోపించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల తమ కుటుంబం ఎంతో ప్రయోజనం పొందిందని ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఆనం జయకుమార్ రెడ్డి అన్నారు. తమ అన్నలు ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి రాజకీయ ఎదుగుదలకు వైయస్ రాజశేఖర రెడ్డి సహాయం చేశారని ఆయన నెల్లూరులో శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ నుంచి లబ్ధిపొందినవారిలో మొదటి వారు తన అన్నలేనని ఆయన అన్నారు. ఆనం వివేకానంద రెడ్డి రాజకీయంగా ముందుకు రావడానికి వైయస్ చలువే కారణమని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల ఎంతో మంది కొత్తగా మంత్రులయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. వైయస్ వల్ల ప్రయోజనం పొంది ఇప్పుడు విమర్సిస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన శనివారం అన్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications