దోపిడీ రాజ్యం తెస్తారు: జగన్, షర్మిలలపై బొత్స

హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏవిధమైన తప్పు చేయలేదని ఆయన అన్నారు. జగన్పై ఆనం రామనారాయణ రెడ్డి వాస్తవాలు చెప్పారని ఆయన కితాబు ఇచ్చారు. మంత్రులను అరెస్టు చేయాలని అంటున్నారని, వైయస్సార్ చేయాలని చెప్తేనే మంత్రులు చేశారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పిందే సబితా ఇంద్రారెడ్డి చేశారని, ఇందులో సబితా ఇంద్రారెడ్డి తప్పేమీ లేదని ఆయన అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అమృతహస్తాన్ని మొండి హస్తంగా వ్యాఖ్యానిస్తున్న చంద్రబాబుకు పచ్చకామెర్లున్నాయని, పచ్చకామెర్లు ఉన్నవారికి అన్నీ పచ్చగానే కనిపిస్తాయని బొత్స అన్నారు. చంద్రబాబు నాయుడు బలహీన, బడుగు వర్గాల గురించి ఏనాడు కూడా ఆలోచన చేయలేదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురం పర్యటన సందర్భంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ శానససభ్యులు పల్లె రఘనాథ రెడ్డికి, పార్థసారథికి గృహనిర్బంధం విధించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని తెలుగుదేశం, వామపక్షాలు ప్రకటించాయి. దీంతో పోలీసులు ముఖ్యమంత్రి పర్యటనకు భారీ భద్రత కల్పించారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీతను పోలీసులు ఆముదాలగొంది వద్ద అడ్డుకున్నారు.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications