భార్యతో భవనంపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య
పెద్ద శబ్దం రావడంతో అటువైపు భవనం వాచ్మన్ పరిగెత్తి చూశాడని, వారిద్దరు కింద పడి ఉండడాన్ని చూశాడని పోలీసులు చెప్పారు. భవనం నాలుగో అంతస్థులోని బాల్కనీ నుంచి కింది దూకి ఉంటారని, ఆ వెంటనే మరొకరు దూకి ఉంటారని పోలీసులు భావిస్తున్నారీు. అభిరామి అక్కడికక్కడే మరణించగా, అరివలగన్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.
దంపతులిద్దరు కంప్యూటర్ అప్లికేషన్స్లో పోస్టు గ్రాడ్యుయేట్స్. భార్య ఐటి రంగంలో పనిచేయాలని ఆరాపడుతుందనేది, దాంతో భర్త తీవ్ర నిస్పృహకు గురయ్యాడని, ఆమెను వ్యతిరేకిస్తూ వచ్చాడని, దాంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవని అంటున్నారు.
క్రోంపేట ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అరివలగన్ సేలం జిల్లాకు, అభిరామి ఏరోడ్ జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. టెక్కీ దంపతుల మృతిపై మాట్లాడడానికి బంధువులు, మిత్రులు నిరాకరించారు. పోలీసులకు సూసైడ్ నోట్ ఏదీ దొరకలేదు.