వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారుపై ఎర్రలైట్ తొలగింపు: ఎంపి జయప్రద హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprada
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాంపూర్ సమాజ్‌వాది పార్టీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద కారు రెడ్ బల్బ్‌ను అధికారులు తొలగించారు. కొందరు ప్రభుత్వ అధికారులు తన నివాసానికి వచ్చి మరీ తన వాహనంపై ఉండే ఎర్ర లైట్‌ను తొలగించారని ఆమె శనివారం ఆరోపించారు.

ఈ రెడ్ లైట్ తొలగించే ప్రక్రియలో దాదాపు ఇరవై నాలుగు మంది అధికారులు పాల్గొన్నారని ఆమె అన్నారు. వారిలో పోలీసులు కూడా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటులో ప్రస్తావిస్తానని జయప్రద హెచ్చరించారు. అధికారులు తన నివాసానికి వచ్చి ఎర్ర లైట్ తొలగించాల్సిన అవసరం లేదన్నారు.

ఎక్కడైనా రోడ్డు మీదనే తనిఖీలు నిర్వహించి ఉండవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నెల 3వ తేదిన జయప్రద ఉన్న ఓ హోటల్ గదిపై జరిగిన దాడి నేపథ్యంలోనే తాజాగా ఆమె వాహనంపై ఉన్న ఎర్ర లైటును తొలగించారు. జయప్రద ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారనే అనుమానంతో రైడ్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

కాగా, 2014 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు జయప్రద ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరులోగా తాను ఏ పార్టీలో చేరేది చెబుతానని ఆమె అన్నారు. 2009 ఎన్నికల్లో ఎస్పీ ఎంపీ అభ్యర్థిగా రాంపూర్ నుండి గెలుపొందారు. ఆ తర్వాత ఆమె అమర్ సింగ్‌తో పాటు పార్టీ నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎపి రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు.

English summary

 Samajwadi Party MP Jaya Prada on April 13 said the beacon of her vehicle was forcibly removed by some government officials and threatened to raise the issue in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X