కర్ణాటక మాజీ గవర్నర్ రమాదేవి కన్నుమూత

ఎంఎ, ఎల్ఎల్ఎం చేసిన రమాదేవి 1990 నవంబర్ 26వ తేదీ నుంచి 1990 డిసెంబర్ 11వ తేదీ వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. టిఎన్ శేషన్ తర్వాత ఆమె చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆమె 1997 జులై 26వ తేదీ నుంచి 1999 డిసెంబర్ 1వ తేదీ వరకు హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు.
1999 డిసెంబర్ 2వ తేదీ నుంచి 2002 ఆగస్టు 20వ తేదీ వరకు కర్ణాటక గవర్నర్గా ఉన్నారు. ఆమె లా కమిషన్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ఆమె పనిచేశారు. జాతీయ మహిళా కమిషన్ గౌరవ సలహాదారుగా కూడా ఉన్నారు.
వియస్ రమాదేవి తెలుగులో నవలలు, కథలు, వ్యాసాలు, నాటకాలు రాశారు. మహిళలు - చట్టాలు, పిల్లలు - చట్టాలు వంటి ఎన్నో రచనలు చేశారు. రాజ్యసభ ఎట్ వర్క్ అనే రచనకు ఆమె సహ రచయితగా ఉన్నారు.












Click it and Unblock the Notifications