బెంగళూరులో పేలుళ్లు: హెబ్బాల వద్ద మరో బ్లాస్ట్?
కాగా, అంతకుముందు కర్నాటకలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయం ఎదుట ఈ పేలుడు సంభవించింది. ఓ ద్విచక్ర వాహనంపై బాంబును ఉంచడంతో ఈ పేలుడు సంభవించింది.
కర్నాటక ఎన్నికలకు మరో ఇరవై రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి సమయంలో బిజెపి ఆఫీసు వద్ద కారులో సిలిండర్ పేలుడు కలకలం రేపింది. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుడు ఘటనలో పదకొండుమందికి గాయాలయ్యాయి. అందులో ఎనిమిది మంది పోలీసులు. వారిని ఆసుపత్రికి తరలించారు. మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
వరుస పేలుళ్ల నేపథ్యంలో ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పేలుళ్ల నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాదు వంటి మెట్రో నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
బెంగళూర్ బిజెపి కార్యాలయం వద్ద పేలుడు వీడియో