సిబిఐపై రాజకీయ ఒత్తిళ్లపై సుప్రీం స్పందన, అక్షింతలు

ప్రభుత్వానికి నివేదిక వివరాలు తెలపడంతో దర్యాఫ్తు ప్రక్రియ బలహీనమైనదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దర్యాఫ్తు వివరాలను ప్రభుత్వానికి చెప్పినట్లుగా కోర్టుకు ఎందుకు తెలుపలేదని సుప్రీం కోర్టు సిబిఐని ప్రశ్నించింది. నివేదిక వివరాలు బయటపడటంపై కేంద్రంతో పాటు సిబిఐకి అక్షింతలు వేసింది.
సిబిఐకి స్వయంప్రతిపత్తిని కల్పిస్తామని చెప్పారు. రాజకీయ జోక్యం నుండి సిబిఐకి విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. సిబిఐకి స్వయంప్రతిపత్తి పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది. వివరాలు ప్రభుత్వానికి తెలపడం మామూలు విషయం కాదని అభిప్రాయపడింది.
సిబిఐపై రాజకీయ ప్రభావం పడకుండా చేయడమే తమ ప్రథమ సంకల్పమన్నారు. సిబిఐ రాజకీయ నేతల సూచనలను తీసుకోవద్దని ఆదేశించింది. మరోవైపు పార్లమెంటులో ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. బొగ్గు కుంభకోణం, 2జి అంశాలపై నిరసన చేపట్టి నినాదాలు చేశాయి. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా వాయిదా పడింది.












Click it and Unblock the Notifications