ప్లీజ్! మళ్లీ వెళ్లండి: చిరు ఫాలోయింగ్కి హైకమాండ్ ఫిదా
కన్నడ నటులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కర్నాటకలోనే కన్నడ నటులకు కూడా రాని అనూహ్య స్పందన మెగాస్టార్కు వచ్చింది. కర్నాటకలో చిరంజీవికి వచ్చిన అనూహ్య స్పందనతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం మరింత ఫిదా అయిపోయిందట. ఎపిలోనే కాకుండా కర్నాటకలో చిరుకు అంతగా స్పందన వస్తుండటంతో ఆయనను మరో రెండు రోజులు పర్యటించాలని సూచించింది.
ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందని, గురు, శుక్రవారాలతో ప్రచారం ముగుస్తుందని, ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు కూడా ప్రచారం చేయాలని చిరంజీవికి అధిష్టానం సూచించింది. దీంతో చిరంజీవి ఈ రోజు, రేపు తెలుగువారు అధికంగా ఉండే హోస్పేట, బళ్లారి నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన ఈ రోజు కర్నాటక బయలుదేరుతున్నారు.
చిరంజీవి తొలి విడతలో చిక్మగ్ళూరు, బెంగళూరులలో పర్యటించారు. ఆ పర్యటనకు మంచి స్పందన వచ్చింది. ఆయనను చూసేందుకు భారీగా ప్రజలు, అభిమానులు వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట కూడా జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.